కార్తిక్రాజు, మిస్తీచక్రవర్తి జంటగా నటిస్తున్న చిత్రం ‘వస్తున్నా..వచ్చేస్తున్నా’. తేజస్వి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై సందీప్ గోపిశెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్ను ఇటీవల దర్శకుడు శేఖర్ కమ్ముల విడుదలచేశారు. ఆయన మాట్లాడుతూ ‘ఫస్ట్లుక్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. సినిమా ప్రేక్షకుల్ని మెప్పిస్త్తూ యూనిట్ అందరికి మంచి పేరుతెచ్చిపెట్టాలి’ అని తెలిపారు. దర్శకనిర్మాత మాట్లాడుతూ ‘వాణిజ్య హంగులతో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రమిది. ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తించే అంశాలుంటాయి. నవ్యమైన పాయింట్తో నిజాయితీగా తెరకెక్కించాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో టీజర్ను విడుదలచేస్తాం’ అని తెలిపారు. ప్రశాంత్, భీమనేని శ్రీనివాస్, దేవిప్రసాద్, పోసానికృష్ణమురళి, ఆమని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మహి శేర్ల, సంగీతం: జీవీ.