టాలీవుడ్ క్యూట్ కపుల్స్లో ఒకరిగా ఉన్న సమంత- నాగ చైతన్య కొద్ది సేపటి క్రితం విడాకులపై అఫీషియల్ ప్రకటన చేశారు.2 017 అక్టోబరు 6న వీరిద్దరు గోవాలో పెళ్లి చేసుకున్నారు. మరికొద్ది రోజుల్లో వీరి విహహబంధానికి నాలుగేళ్లు పూర్తవుతాయనగా వీళ్లు తమ బంధానికి ముగింపు పలుకుతున్నట్టు తెలియజేశారు. ఈ వార్త విని చాలా మంది అభిమానులు షాకింగ్లో ఉన్నారు.
స్టార్ కపుల్ సమంత, నాగ చైతన్య శనివారం మధ్యాహ్నం 3:31 నిమిషాలకు విడిపోతున్నట్టు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వెంటనే అభిమానులు భారీ స్థాయిలో స్పందించారు. ఎందుకు విడాకులు తీసుకుంటారు ? ఏం జరిగిందంటూ అభిమానులు వేల సంఖ్యలో రీ ట్వీట్లు చేశారు . ఊహించని వార్తలపై విచారం వ్యక్తం చేశారు.
ఈ జంట చాలా చూడముచ్చటగా ఉంటుంది. చిన్న చిన్న వివాదాలని పరిష్కరించుకోండి అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.మరో నెటిజన్ మంచి భవిష్యత్ని నాశనం చేసుకోవద్దని సలహా ఇచ్చారు. అయితే సమంత విడాకుల విషయం ప్రకటించిన వెంటనే తన కామెంట్ సెక్షన్ క్లోజ్ చేయడం గమనర్హం.
సమంత ఎప్పుడైతే తన సోషల్ మీడియా పేజ్లో అక్కినేని పేరు తొలగించిందో అప్పటి నుండి అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. అనేక ప్రచారాలు నడిచాయి. త్వరలో వీరిరివురు పిల్లలను ప్లాన్ చేసే ఆలోచనలో కూడా ఉన్నారని పుకార్లు వచ్చాయి.
ఇక ఇటీవల సమంత తన ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో ముచ్చటించగా, తాను హైదరాబాద్ వదిలి వెళ్లనని పేర్కొంది. హైదరాబాద్ తనకు పుట్టినిల్లు లాంటిది అని పేర్కొంది. అయితే భార్య భర్తలుగా విడిపోయిన కూడా తాము ఫ్రెండ్స్గా కొనసాగుతాం అని చెప్పుకొచ్చారు.