సాయి ధన్సిక ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘దక్షిణ’. ఈ చిత్రాన్ని సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ఓషో తులసీరామ్ రూపొందిస్తున్నారు. అశోక్ షిండే నిర్మాత. పూజా కార్యక్రమాలతో సినిమా షూటింగ్ ప్రారంభమైంది.
నిర్మాత అశోక్ షిండే మాట్లాడుతూ…‘నాయిక ప్రధానంగా సాగే చిత్రమిది. నేటి నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తున్నాం. నవంబర్ రెండో వారానికి షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేశాం’ అని అన్నారు. రిషబ్ బసు, సుభాష్, ఆనంద భారతి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.