కొద్ది రోజుల క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శక దిగ్గజం శంకర్ కాంబినేషన్లో సినిమా ఉంటుందని అఫీషియల్ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. చరణ్ 15వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించి కొద్ది రోజులుగా అనేక వార్తలు వస్తున్నాయి. ఒకే ఒక్కడు..
భారతీయుడు..
అపరిచితుడు` రేంజ్ లో… శంకర్ మరో అద్భుతమైన స్క్రిప్ట్ ని సిద్ధం చేశారని ప్రచారమవుతోంది. నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్ రాజకీయ నాయకుడిగా మారితే ఎలా ఉంటుందనే కోణంలో శంకర్ ఈ మూవీని తెరకెక్కించనున్నాడట.
సామాజిక రాజకీయ అంశాల కోణంలో ఎమోషనల్ డ్రైవ్ తో కథ అంతా సాగుతుందని టాక్ వినిపిస్తోంది. కలెక్టర్ సీఎంగా మారి వ్యవస్ధలోని లోపాలను ఎలా సరిజేయగలడనేది శంకర్ తనదైన శైలిలో చూపించనున్నాడట. ఒకే ఒక్కడు తరహా కంటెంట్కి సరికొత్త సొబగులు అద్ధి శంకర్ తెరకెక్కించనుండగా, ఈ సినిమాకి మూల కథను కార్తీక్ సుబ్బరాజ్ అందిస్తున్నారని తెలిసింది. దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.