‘రంగస్థలం’ వంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత రామ్చరణ్-సుకుమార్ కలయికలలో తెరకెక్కబోతున్న తాజా సినిమా అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ‘ఆర్సీ17’ వర్కింగ్ టైటిల్తో రూపొందనున్న ఈ సినిమా సెప్టెంబర్లో లాంఛనంగా ప్రారంభం కానున్నట్లు సమాచారం. ‘పుష్ప’ ‘పుష్ప-2’ వంటి పాన్ ఇండియా బ్లాక్బస్టర్స్ తర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా ఇదే కావడంతో జాతీయ స్థాయిలో ఈ ప్రాజెక్ట్పై హైప్క్రియేట్ అయింది. ప్రస్తుతం హీరోయిన్ను ఖరారు చేసే పనిలో చిత్రబృందం ఉన్నట్లు తెలిసింది. కృతిసనన్, రుక్మిణి వసంత్లపై లుక్ టెస్ట్ కూడా చేసినట్లు వార్తలొచ్చాయి.
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ‘పుష్ప’ ఫ్రాంఛైజీ చిత్రాలతో తనకు నేషనల్ లెవల్లో స్టార్డమ్ను తీసుకొచ్చిన దర్శకుడు సుకుమార్పై అభిమానంతో ఈ సినిమాలో భాగం అయ్యేందుకు రష్మిక మందన్న సుముఖంగా ఉందని చెబుతున్నారు. ఇదిలావుండగా కెరీర్ ఆరంభం నుంచి సుకుమార్ తన సినిమాల్లో కథానాయికల్ని రిపీట్ చేయలేదు. ఒకవేళ ‘ఆర్సీ17’లో రష్మిక మందన్న నాయికగా ఖరారైతే సుకుమార్ ఆ సెంటిమెంట్ను బ్రేక్ చేసినట్లేనని అభిమానులు అనుకుంటున్నారు.