శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్రంలో నటిస్తున్నారు రామ్ చరణ్. ఈ పాన్ ఇండియా చిత్రంలో కియారా అద్వానీ నాయికగా నటిస్తున్నది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. రాజకీయ నేపథ్య చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంటున్నది. ఈ చిత్ర షూటింగ్ అప్డేట్ సమాచారం చూస్తే..తాజాగా ఈ సినిమాలోని పాటను హైదరాబాద్లో చిత్రీకరిస్తున్నారు.
ఓల్డ్ సిటీ పరిసరాల్లో కొంత పార్ట్ ఈ పాటను షూట్ చేస్తారని, ఆ తర్వాత వైజాగ్, రాజమండ్రి లొకేషన్స్లో మిగతా భాగం రూపొందిస్తారని తెలుస్తున్నది. ఈ పాటలో చరణ్ సందడి చేయబోతున్నారు. రామ్చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ పొలిటికల్ ఎంటర్టైనర్ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ చిత్రంలో శ్రీకాంత్, అంజలి, సునీల్, ఎస్జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చరణ్ ఈ చిత్రంతో పాటు బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు.