Sonam Wangchuk | సోనమ్ వాంగ్చుక్ (Sonam Wangchuk)ఈ పేరు వింటే ఎవరు గుర్తుపట్టకపోవొచ్చు కానీ.. త్రీ ఇడియట్స్ మూవీలో ఫున్సుఖ్ వాంగ్డు (phunsukh wangdu) అంటూ ఇట్టే గుర్తుపడతారు. త్రీ ఇడియట్స్ మూవీలో ఆమిర్ ఖాన్ పోషించిన ఫున్సుక్ వాంగ్డు పాత్ర ఆయనదే. భారతదేశం గర్వించదగ్గ ఇంజినీర్, శాస్త్రవేత్త ఇతడు.. తాజాగా ఈయన లఢక్ రక్షణ గురించి క్లైమేట్ ఫాస్ట్ (Climate Fast) అనే ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. కాసేపు ఉంటే చాలు ప్రాణాలు పోతాయేమో అనేంత గడ్డ కట్టుకుపోయే చలిలో గత 21 రోజుల నుంచి సేవ్ లఢక్ అంటూ ఉద్యమం చేస్తున్నాడు.
కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలంటూ అక్కడి ప్రజలు కేంద్రంపై కలిసికట్టుగా పోరాడుతున్నారు. లడఖ్కు రాష్ట్ర హోదాతో పాటు మరో నాలుగు డిమాండ్లను నెరవేర్చలంటూ కార్గీల్ డెమోక్రటిక్ అలయన్స్ నిరాహార దీక్ష చేపట్టింది. ఇందులో భాగంగా లడఖ్కు చెందిన ప్రముఖ విద్యవేత్త, పర్యావరణ ఉద్యమకారుడు, రామన్ మొగసాసే అవార్డు గ్రహీత సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్షలో పాల్గోంటున్నాడు. అయితే సోనమ్ చేస్తున్న దీక్ష నేటికి 21 రోజులు పూర్తికావడంతో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ అతడికి మద్దతు తెలిపాడు.
”ఈరోజు నా పుట్టినరోజు.. ‘ఈ సందర్భంగా.. క్లైమేట్ ఉద్యమంలో భాగంగా మన దేశం.. మన పర్యావరణం, మన భవిష్యత్తు కోసం పోరాడుతున్న లడఖ్ ప్రజలు సోనమ్ వాంగ్చుక్ (Sonam Wangchuk)లకు నా పూర్తి మద్దతు తెలుపుతున్నాను. మనంమందరం లఢక్ ప్రజల కోసం అండగా నిలుద్దాం.” అంటూ రాసుకోచ్చాడు.
Its my birthday today .. and i’m celebrating by showing solidarity with @Wangchuk66 and the people of ladakh who are fighting for us .. our country .. our environment and our future . 🙏🏿🙏🏿🙏🏿let’s stand by them #justasking pic.twitter.com/kUUdRakYrD
— Prakash Raj (@prakashraaj) March 26, 2024
అసలు ఎందుకు ఈ ఉద్యమం..
2019లో పార్లమెంట్ లో జమ్ము కశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ జరిగిన అనంతరం.. లద్దాఖ్, జమ్ము కశ్మీర్లను యూనియన్ టెర్రిటరీలుగా ప్రకటించింది కేంద్రం. అయితే ఇలా ప్రకటించడం వలన లద్దాఖ్, జమ్ముకశ్మీర్లపై ఉన్న ఆంక్షలు తొలగిపోయాయి. దీంతో పెట్టుబడిదారుల కన్ను లద్దాఖ్పై పడే అవకాశం ఉందని.. అలాగే సాధారణ ప్రజలు ఇక్కడ తాము నివసించాలని కోరుకుంటారని.. అలా జరిగితే.. పర్యావరణ సమస్య వచ్చే అవకాశం ఉందని.. ఇప్పటికే హిమాలయాలు గ్లోబల్ వార్మింగ్ వలన కరిగిపోతున్నాయి.. ఇక్కడ పెట్టుబడులు పెట్టడం.. మైనింగ్ స్టార్ట్ చేయడం లాంటివి చేస్తే ప్రకృతి అంతా నాశనం అవుతోందని ప్రజలు చెబుతున్నారు. అయితే లద్దాఖ్కు ట్రైబల్ ఏరియా స్టేటస్ ఇచ్చి 6th షెడ్యూల్ లోకి తీసుకురావాలని సోనమ్ దీక్ష చేస్తున్నాడు. షెడ్యూల్ 6 ప్రకారం ఇప్పటికే నాలుగు ఈశాన్య రాష్ట్రాలు అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాంలకు ట్రైబల్ ఏరియా రికగ్నైజేషన్ ఉంది. దీంతో ఆర్టికల్ 244 ప్రకారం ఆ రాష్ట్రాల్లో అటానామస్ డిస్ట్రిక్ అడ్మినిస్ట్రేషన్స్ ఉంటాయి. రాష్ట్రంతో కలిసి ఉంటూనే ఏ జిల్లాకు ఆ జిల్లా కు వాళ్లకు లెజిస్లేటివ్. జ్యూడిషియల్, అడ్మినిస్ట్రేటివ్ అటానమీ ఉంటుంది. అయితే ఇలా ఉండాలంటే ఆ ప్రాంతాల్లో 50 శాతం గిరిజనులు ఉండాలి. అయితే రాజ్యాంగం ప్రకారం 50 శాతం గిరిజనులుంటేనే ట్రైబల్ ఏరియా రిగజ్నైషన్ ఇస్తుంది. మరి 90 శాతం గిరిజనులున్న లద్దాఖ్కు ట్రైబల్ ఏరియా రికగ్నైజేషన్ ఎందుకివ్వరు అంటూ కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా సోనమ్ వాంగ్ చుక్తో పాటు అక్కడి ప్రజలు ధర్నా చేస్తున్నారు.
21st Day OF MY #CLIMATEFAST
350 people slept in – 10 °C. 5000 people in the day here.
But still not a word from the government.
We need statesmen of integrity, farsightedness & wisdom in this country & not just shortsighted characterless politicians. And I very much hope that… pic.twitter.com/X06OmiG2ZG— Sonam Wangchuk (@Wangchuk66) March 26, 2024