ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సంస్థ భారీ వ్యయంతో పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించబోతున్న విషయం తెలిసిందే. దీపికాపడుకోన్ కథానాయిక. బిగ్ బి అమితాబ్బచ్చన్ కీలక పాత్రలో నటించబోతున్నారు. సైన్స్ ఫిక్షన్ కథతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నామని, ప్రేక్షకుల్ని సరికొత్త ప్రపంచంలో విహరింపజేసే చిత్రమిదని దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ సందర్భంలో చెప్పారు. తాజా సమాచారం ప్రకారం టైమ్ ట్రావెల్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని తెలిసింది. భవిష్యత్తును దర్శనం చేస్తూ 2050 దశకం నేపథ్యంలో కథ సాగుతుందని సమాచారం. భారీ స్థాయిలో సెట్స్, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ సినిమాను దృశ్యమానం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలైలో సెట్స్మీదకు తీసుకురానున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకులముందుకురానుంది. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ‘ఆదిపురుష్’ ‘సలార్’ చిత్రాల్లో కథానాయకుడిగా నటిస్తున్నారు.