అగ్ర కథానాయిక పూజాహెగ్డే తన సినీ ప్రయాణంలో విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది. భారీ సినిమాల్లో అవకాశాలొస్తున్నా..విజయాలు వరించకపోవడం ఈ మంగళూరు సుందరిని కలవరపెడుతున్నది. ఎలాగైనా ఓ భారీ హిట్తో పరాజయాలపరంపరకు బ్రేక్ వేయాలనే కృతనిశ్చయంతో ఉంది. వరుస ఫ్లాపులొచ్చినా ఆఫర్ల పరంగా తనకు ఢోకాలేదని ధీమా వ్యక్తం చేస్తున్నది. ఈ నేపథ్యంలో తెలుగులో ఈ భామ మరో పెద్ద ప్రాజెక్ట్లో నాయికగా ఎంపికైనట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. నితిన్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామాకు సన్నాహాలు జరుగుతున్నాయి.
వీరిద్దరి కాంబినేషన్లో ‘ఇష్క్’ వంటి బ్లాక్బస్టర్ హిట్ రావడంతో..తాజా సినిమాపై అందరిలో ఆసక్తిపెరిగింది. నితిన్ హార్స్ రైడర్గా కనిపించే ఈ చిత్రానికి ‘స్వారీ’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో కథానాయికగా పూజాహెగ్డే దాదాపుగా ఖరారైందని టాక్. నితిన్తో ఈ భామ నటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో సెట్స్మీదకు వెళ్లనుంది. స్వీయ నిర్మాణ సంస్థ శ్రేష్ట్మూవీస్ బ్యానర్లో నితిన్ ఈ సినిమా చేయబోతున్నారు.