త్రిపుర నిమ్మగడ్డ, వెంపకాశీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పంచనామా’. సిగటాపు రమేష్ నాయుడు దర్శకుడు. గద్దె శివకృష్ణ, వెలగరాము నిర్మాతలు. ఈ చిత్ర ఫస్ట్లుక్, టీజర్ను ఇటీవల దర్శకుడు వి.వి.వినాయక్ విడుదలచేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘రియలిస్టిక్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. హత్యకేసు అన్వేషణలో ఓ మహిళా పోలీస్ అధికారి తెలుసుకున్న నిజాలేమిటన్నది ఉత్కంఠను పంచుతుంది. సినిమా రూపకల్పనలో వినాయక్ ఇచ్చిన సలహాలు, సూచనలు చక్కగా ఉపయోగపడ్డాయి’ అని చెప్పారు. కొత్తదనాన్ని కోరుకునే ప్రతి ఒక్కరిని ఈ సినిమా మెప్పిస్తుందని నిర్మాతలు అన్నారు. ముక్కు అవినాష్, ఆలపాటి లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రదీప్చంద్ర.