అమరావతి : మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi) కి ఎన్టీఆర్ ( NTR ) జాతీయ పురస్కారాన్ని ప్రకటించడం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ( Pawan Kalyan )అభినందనలు వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ( Gaddar Awards) సినీ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవికి అవార్డు రావడం పట్ల ఆయన తమ్ముడు పవన్కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి ప్రస్థానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. అదే విధంగా అవార్డు గ్రహితలు కమల్ హసన్, సింగీతం శ్రీనివాసరావు, అశ్వినీదత్, ఆర్ .నారాయణమూర్తి, రమేశ్ ప్రసాద్, సుద్దా అశోక్ తేజకు, జయసుధకు అభినందనలు తెలిపారు.