స్టార్ హీరోలందరు బుల్లితెరపై పసందైన విందు అందించేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, చిరంజీవి, నాగార్జున, నాని వంటి సెలబ్స్ బుల్లితెరపై పలు కార్యక్రమాలతో సందడి చేయగా, రానా కూడా నెం 1 యారి అనే షోతో అలరించాడు. ఈ కార్యక్రమం ఇప్పటికే రెండు సీజన్స్ పూర్తి చేసుకోగా ఇప్పుడు మూడో సీజన్ జరుపుకునేందుకు సిద్ధమైంది. ఈ మూడో సీజన్లో మరింత థ్రిల్ ఇచ్చేందుకు రానా సిద్ధమైనట్టు తెలుస్తుంది. మార్చి 14 నుండి రాత్రి 9 గం.లకు ఈ షో ఆహాలో ప్రసారం కానుంది.
రానా ప్రస్తుతం అరణ్య, విరాట పర్వం చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అరణ్య చిత్రం మార్చి 26న విడుదల కానుండగా, ఇటీవల చిత్ర ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్ . ఇది సినిమాపై భారీ అంచనాలు పెంచింది. ఇక రానా నటిస్తున్న మరో చిత్రం విరాట పర్వం ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఇందులో రానా నక్సలైట్గా కనిపిస్తారని టాక్