Yash Raj Film | యష్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films). ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఈ ప్రొడక్షన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి మూవీ వస్తుందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ సంబరపడిపోతుంటారు. ఇప్పటికే యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన దిల్వాలే దుల్హనియా లే జాయేంగే (DDLJ), దిల్ తో పాగల్ హై(Dil Tho Pagal Hai), ధూమ్ (Dhoom), చక్ దే ఇండియా (Chak De India), ఏక్ థా టైగర్ (Ek Tha Tiger), సుల్తాన్ (Sulthan) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించాయి. ఇక ఈ ప్రొడక్షన్ నుంచే రణ్వీర్ సింగ్ (Ranveer Singh), అర్జున్ కపూర్ (Arjun Kapoor), భూమి పెడ్నేకర్ (Bhumi), మానుషి చిల్లర్ (manushi Chillar), షాలినీ పాండే ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ మోస్ట్ ప్రెస్టీజియస్ బ్యానర్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్తో చేతులు కలిపింది.
యష్ రాజ్ ఫిలిమ్స్, ఇండియన్ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ కలిసి పని చేయనున్నాయి. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ సోషల్ మీడియాలో వెల్లడించింది. ఇక ఈ ఒప్పందంలో భాగంగా ‘ది రైల్వే మెన్'(The Railway Men), ‘మహారాజ్(Maharaj)’ అనే రెండు ప్రాజెక్ట్లను అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్లను యష్ రాజ్ ఫిలిమ్స్, నెట్ఫ్లిక్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
కోలీవుడ్ స్టార్ హీరో ఆర్. మాధవన్, కే కే మీనన్, దివ్యేండు శర్మ, బాబిల్ ఖాన్ ప్రధాన పాత్రల్లో ‘ది రైల్వే మెన్’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. ఈ వెబ్ సిరీస్కు శివ్ రావైల్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీనితో పాటు ‘మహారాజ్’ అనే ప్రాజెక్ట్కు సిద్ధార్థ్ పి. మల్హోత్రా దర్శకత్వం వహిస్తుండగా.. జునైద్ ఖాన్, జైదీప్ అహ్లావత్, శర్వరి, షాలిని పాండే తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Netflix and Yash Raj Films join forces to bring a new era of blockbusters! Coming soon! pic.twitter.com/QIBHXqKRj8
— Netflix India (@NetflixIndia) September 15, 2023