Aditi Gautam | ప్రస్తుతం ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. కొంతకాలంగా బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్గా నిలుస్తున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వాణీల పెళ్లి మంగళవారం రాజస్థాన్ జైసల్మేర్లోని సూర్యగఢ్ హోటల్ ప్యాలెస్లో వైభవంగా జరిగింది. కాగా వీళ్ల పెళ్లి రోజే మరో సెలబ్రెటీ వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. నేనింతే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అదితి గౌతమ్ తాజాగా ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది.
ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మిఖాయిల్ పాల్కివాలాతో ఆమె ఏడడుగులు వేసింది. ఈ విషయాన్ని అదితి స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. కాగా మోడల్గా కెరీర్ ప్రారంభించిన అదితి నేనింతే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఫ్లాప్ అవడంతో తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత కన్నడలో డబుల్ డెక్కర్ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించింది. ఇక తెలుగులో వేదం, పక్కా కమర్షియల్ వంటి సినిమాల్లో చిన్న పాత్రలు చేసింది. బాలీవుడ్ సంజూ సినిమాలోనూ ఓ చిన్న పాత్రలో మెరిసింది.
View this post on Instagram
A post shared by Aditi Gautam | Siya gautam | Actor | influencer (@aditigautamofficial)