నాగచైతన్య కథానాయకుడిగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతిశెట్టి కథానాయిక. హైదరాబాద్లో నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, ఆయన తనయుడు యువన్శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతాన్నందిస్తుండటం విశేషం. షూటింగ్ ఆరంభాన్ని పురస్కరించుకొని మంగళవారం నాగచైతన్యకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. ‘అక్కినేని నాగేశ్వరరావుగారి దివ్యాశీస్సులతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను నేటి నుంచి మొదలుపెడుతున్నాం. ఈ చిత్రం గురించిన మరిన్ని వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అని నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ చిత్రానికి సంభాషణలు: అబ్బూరి రవి, సమర్పణ: పవన్కుమార్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: వెంకట్ ప్రభు.