‘సీతారామం’ వంటి బ్లాక్బస్టర్ సినిమా ద్వారా టాలీవుడ్లో అడుగుపెట్టిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఈ సినిమాలో సీతగా అలరించిన మృణాల్.. ‘హాయ్ నాన్న’తో మరోసారి ప్రేక్షకులకు దగ్గరైంది. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్’లోనూ ఈ భామ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే, ‘విశ్వంభర’లో మెగాస్టార్తో నటించే ఆఫర్ను తిరస్కరించిందని వార్తలు వచ్చాయి.
ఆ సినిమాకు ఎక్కువ డేట్లు ఇవ్వాల్సి వస్తుందన్న కారణంగా చిరుతో స్క్రీన్ పంచుకునే అవకాశాన్ని వదులుకుందట! ప్రస్తుతానికి తన దృష్టి మొత్తం బాలీవుడ్పైనే ఫోకస్ చేసిందట ఈ బ్యూటీ. సంజయ్ లీలా భన్సాలీ సంగీతం అందిస్తూ నిర్మించనున్న రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటించడానికి మృణాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఇండస్ట్రీ టాక్. రవి ఉద్యావర్ దర్శకత్వం వహించనున్న ఈ ప్రేమకథా చిత్రంలో నటించడానికే టాలీవుడ్ ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తున్నదని చెబుతున్నారు.
ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కనున్న పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్గా మృణాల్ పేరు పరిశీలనలో ఉందని ఫిల్మ్నగర్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కాగా, తెలుగులో రెండు హిట్లు అందుకున్న మృణాల్కు హిందీలో అనుకున్న సక్సెస్ దక్కలేదనే చెప్పాలి. అందుకే బాలీవుడ్లో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలనే పట్టుదలతో ఈ బ్యూటీ ఉందని అంటున్నారు.