ఆండ్రియా జెర్మియా, విజయ్ సేతుపతి, పూర్ణ, సంతోష్ ప్రతాప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘పిశాచి 2’. ఈ చిత్రానికి మిస్కిన్ దర్శకత్వం వహిస్తున్నారు. టి.మురుగానందం నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు విడుదల చేస్తున్నారు.
చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్నది. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి లిరికల్ పాట ‘కాలమెంత వేగములే’ ను విడుదల చేశారు. కార్తీక్ రాజా స్వరకల్పనలో సిధ్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు పోతుల రవికిరణ్ సాహిత్యాన్ని అందించారు. ఈ పాటకు శ్రోతల నుంచి మంచి స్పందన వస్తున్నదని చిత్రబృందం తెలిపారు.