ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ (Agent Sai Srinivasa Athreya) ఫేం డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్జే (Swaroop RSJ ) తెరకెక్కిస్తున్న తాజా చిత్రం మిషన్ ఇంపాజిబల్ (Mishan Impossible). బాలీవుడ్ భామ తాప్సీ (Taapsee Pannu) పన్ను మెయిన్ రోల్ చేస్తోంది. ఈ చిత్ర ట్రైలర్ ను మహేశ్ బాబు లాంఛ్ చేశాడు. అరెస్ట్, ఇన్ఫ్లుయెన్స్, బెయిల్..ఈ సైకిల్ బాగా అలవాటు వీడికి అంటూ తాప్సీ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గురించి చెప్తున్న సంభాషణలతో మొదలైంది ట్రైలర్.
చైల్డ్ యాక్టర్లు హర్ష్ రోషన్, భాను ప్రక్షన్, జయతీర్థ మొలుగు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ను పట్టుకునే క్రమంలో జరిగే ప్రయాణం నేపథ్యంలో ఎదుర్కొన్న సంఘటనలతో ఫన్నీగా సాగుతున్న ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది. కలర్ ఫొటో సినిమా డైరెక్టర్ సందీప్ రాజ్, హీరో సుహాస్ ఈ చిత్రంలో కీ రోల్స్ లో నటించారు. తాప్సీ, ముగ్గురు చిన్నారుల జర్నీ తో ఈ కేసు ఎలా సాగిందోననే దానిపై సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది.
మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 1 2022న థియేటర్లలో గ్రాండ్గా విడుదలవుతుంది.