Megastar Chiranjeevi | సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో భాగంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరైన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్లో రాజీవ్ మసంద్ అడిగిన పలు ప్రశ్నలకు చిరు సమాధానం కూడా చెప్పాడు. ఈ నేపథ్యంలోనే ‘జగదేక వీరుడు.. అతిలోక సుందరి’ సీక్వెల్ గురించి మాట్లాడుతూ చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
”రామ్ చరణ్ ఈ మధ్య ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన తో ఒక మూవీ ప్రారంభించాడు. ఈ మూవీలో హీరోయిన్గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తుంది. అయితే మూవీ లాంచ్ ఈవెంట్లో జాన్వీతో మాట్లాడుతున్నప్పుడు కొంచె భావోద్వేగంగా అనిపించింది. అమెని చూస్తున్నప్పుడు శ్రీదేవి గుర్తుకువచ్చింది. ఇండస్ట్రీ మంచి నటిని కోల్పోయింది. రామ్చరణ్, జాన్వీ కపూర్ ‘జగదేక వీరుడు.. అతిలోక సుందరి’ సీక్వెల్ తీస్తే చూడాలని ఉంది.” అంటూ చిరు వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. చిరు ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు. బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో త్రిష కథనాయికగా నటిస్తుంది.