తనదైన హాస్యంతో దాదాపు నాలుగు దశాబ్దాలపాటు టాలీవుడ్ చిత్ర పరిశ్రమని తిరుగులేని విధంగా ఏలిన బ్రహ్మానందానికి ఇటీవల అవకాశాలు తగ్గిపోయాయి. కొత్త కమెడీయన్స్ రావడం, ఆయన వయస్సు మీద పడటంతో పాటు అనేక కారణాల వలన సినిమాలు తగ్గాయి. ఇప్పుడు బ్రహ్మి చిన్నా చితకా సినిమాలలో నటిస్తున్నారు.
ఖాళీ సమయాన్ని బ్రహ్మానందం(Brahmanandam) చక్కగా వినియోగించుకుంటున్నారు. తనలోని కొత్త కళలలకు ఊపిరిపోస్తున్నారు బ్రహ్మానందం. గత ఏడాది కరోనా సమయంలో బ్రహ్మానందం సినిమా షూటింగులు లేనందున ఇంట్లో కూర్చొని పెయింటింగ్ చేసే వారు. అప్పట్లో అవి సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. ఆ తర్వాత అల్లు అర్జున్(allu arjun), రానా దగ్గుపాటి లకు తను 45 రోజుల పాటు వేసిన వెంకటేశ్వర స్వామి పెయింటింగు ను ఫోటో ప్రేమ్ తో సహా తయారుచేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి అందించారు.
ఇకతాజాగా షిర్డి సాయి బాబా ఫోటోని పెయింటింగ్ వేసి ఆ ఫ్రేముని కృష్ణం రాజుకి బహుమతిగా ఇచ్చారు బ్రహ్మానందం. బ్రహ్మీ ఇచ్చిన ఈ సర్ప్రైజ్కి మురిసిపోయిన కృష్ణంరాజు(Krishnam raju) తనతో దిగిన ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.