బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. ఆమె నటించిన చిత్రాలతో కంటే.. వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. అయితే, ఇటీవల దక్షిణాది చిత్రాలు, హీరోలు, దర్శకులపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నది. అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్తోపాటు దర్శకుడు రాజమౌళిపై పొడగ్తలతో ముంచెత్తింది. తాజాగా కేజీఎఫ్-2 చిత్రం హీరో యశ్ను ప్రశంసించింది. ఇన్స్టాగ్రామ్లో యశ్ను అమితా బచ్చన్తో పోలుస్తూ పోస్ట్ పెట్టింది. ‘కొన్ని దశాబ్దాలుగా యాంగ్రీ యంగ్ మ్యాన్ను ఇండియా మిస్సైంది. 1970ల్లో అమితాబ్ బచ్చన్ తర్వాత నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. ఇప్పుడా స్థానాన్ని యశ్ భర్తీ చేశాడు. ఇది అద్భుతం’ అంటూ కంగనా ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది.
1970-80ల్లో అమితాబ్కు ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’ అనే బిరుదు ఉన్న విషయం విధితమే. కంగనా పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఇదిలా ఉండగా.. కేజీఎఫ్-2 చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నది. చిత్రంలో రాకీ భాయ్గా యశ్ నటకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరక్కిన ఈ చిత్రం ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో విడుదలైన తొలి రోజు రూ.134.50కోట్లు రాబట్టింది. చిత్రంలో సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, మాళవిక అవినాష్, జాన్ కొక్కెన్, శరణ్ కీలక పాత్రలు పోషించారు.