సోలో, గీతగోవిందం సినిమాలతో ఇండస్ట్రీ సూపర్ హిట్స్ అందించాడు డైరెక్టర్ పరశురాం ( Parasuram) . గీతగోవిందం సక్సెస్ అనంతరం లాంగ్ గ్యాప్ తీసుకున్న పరశురాం..ఇపుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు (Maheshbabu)తో సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమా చేస్తున్నాడు. మే 12న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ చేస్తూ బిజీ అయిపోయింది పరశురాం అండ్ కీర్తిసురేశ్ (Keerthy Suresh). తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సర్కారు వారి పాటకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
డైరెక్టర్ పరశురాం మాట్లాడుతూ.. ఈ సినిమా కథను మహేశ్ కోసమే రెడీ చేశాను. కథ ఆయనకు నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశారు . సర్కారు వారి పాటలో మహేశ్ బాబు క్యారెక్టరైజేషన్ కు వేటితో కూడా పోలికలుండవు. సినిమాలో యూనిక్ క్యారెక్టరైజేషన్ నచ్చడం వల్లే మహేశ్ వెంటనే ఈ సినిమాను ఓకే చేశాడు. మహేశ్ ఈ సినిమాలో కనిపించే లుక్, నేను చూపించిన విధానం, డైలాగ్ డెలివరీ కానీ వేరే లెవల్లో ఉంటాయన్నాడు పరశురాం.
సోలో సినిమా నుంచి తాను కీర్తిసురేశ్తో పనిచేయాలని అనుకునేవాడిని, కానీ దురదృష్టవశాత్తు కుదరలేదు. కానీ మహేశ్ కథ విన్న తర్వాత హీరోయిన్ ఎవరని అడిగితే కీర్తిసురేశ్ అని చెప్పాను. ఆ వెంటనే కీర్తిసురేశ్ అయితే బాగుంటుంది చేద్దామని మహేశ్ అన్నారని చెప్పాడు.
షూటింగ్ టైంలో ఎప్పటికీ మరిచిపోని విషయం గురించి మాట్లాడుతూ..స్పెయిన్లోని బార్సిలోనాలో షూట్ చేస్తున్నాం. అక్కడ దొంగలు ఎక్కువ. అప్పటి షూటింగ్ షెడ్యూల్కు సంబంధించిన కాస్ట్యూమ్స్ అన్నీ ఒక వ్యానులో పెట్టి..ట్రయల్స్ వేసుకుందామని కొంత గ్యాప్ ఇచ్చి వచ్చే సరికి..వ్యానులో ఉన్న కీర్తిసురేశ్ కాస్టూమ్స్ ఎత్తుకెళ్లారు. నాలుగు సూట్కేసుల్లో మూడు ఎత్తుకెళ్లారు. లక్కీగా అంతకుముందే మరో రెండు రోజులకు సరిపడా కాస్టూమ్స్ అందుబాటులో ఉండటంతో. షూటింగ్కు ఇబ్బంది కలగలేదని, ఆ తర్వాత మళ్లీ కాస్టూమ్స్ ఏర్పాటు చేసుకున్నామని చెప్పుకొచ్చారు పరశురాం అండ్ కీర్తిసురేశ్.
ఇంటర్వ్యూపై ఓ లుక్కేయండి మరీ..