బిగ్ బాస్ త్రిమూర్తులులా పేరు గావించారు షణ్ముఖ్ ,జస్వంత్, సిరి. ఈ ముగ్గురు మోజో రూంలో కూర్చొని తెగ ముచ్చటిస్తూ కనిపిస్తుంటారు.అయితే 58వ ఎపిసోడ్లో జెస్సీ వాంతులు చేసుకుంటుండగా.. షణ్ముఖ్ కాని, సిరి కాని ఏ మాత్రం పట్టించుకోలేదు. సన్నీ వెళ్లి అతనిని పట్టుకున్నాడు.అయితే జెస్సీ.. ఉదయం నుంచి బాధపడుతున్నా షణ్ముఖ్, సిరి పట్టించుకోరేంట్రా అని బాధపడ్డాడు సన్నీ.
లాస్ట్ వీక్లో సీక్రెట్ టాస్క్ ఫెయిల్ అయినప్పటి నుంచి జెస్సీ ఆ ఇద్దరికీ కాస్త దూరంగానే ఉంటున్నాడు అని చెప్పాడు మానస్. వాళ్ల క్లారిటీ వాళ్లకు ఉందని సన్నీతో చెప్పాడు మానస్. ఆ తరువాత కూడా జెస్సీ లోపల బాధపడుతూ ఉండగా.. షణ్ముఖ్ కుక్క బొమ్మపట్టుకుని నా కుక్క సామ్రాజ్యానికి వారసుడు వీడే అంటూ జోక్లు వేశాడు .
ఇక బయట కూర్చున్న షణ్ముఖ్..రవి పూరీ టాస్క్ గురించి డిస్కస్ చేశారు. ‘పూరీ టాస్క్ హైలైట్.. ఎక్కడ నుంచి ఎక్కడకి తీసుకునిపోయారో’.. అని రవి అంటే.. ‘నాకు బాగా కాలింది.. నా వల్లే కెప్టెన్ అయ్యాడని సన్నీ అన్నాడు.. టాస్క్లు కూడా రాంగ్ ఆడానని అన్నాడు.. ఈరోజు నామినేషన్స్లో అన్నీ తీస్తాను’ అని చెప్పాడు షణ్ముఖ్. అనంతరం ప్రియాంక, షణ్ముఖ్లు ముచ్చటించుకుంటున్న సమయంలో ప్రియాంక.. నెక్స్ట్ నేనేనేమో వెళ్లిపోయేది అని అంటే ఇప్పుడైతే వెళ్లవని ధైర్యం చెప్పాడు షణ్ముఖ్. చివరకి ఆమెనే నామినేట్ చేసి బయటకు పంపే స్కెచ్ వేశాడు.