Kaun Banega Crorepati-15 | బిగ్బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న కౌన్ బరేడా కరోడ్ పతి టాక్ షోకు ఏ రేంజ్లో రెస్పాన్స్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ టాక్ షోలో ఇప్పటివరకు వచ్చిన 14 సీజన్లు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక ఇప్పుడు 15వ సీజన్ నడుస్తుంది. కాగా ఈ సీజన్లో మొదటి కోటి రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకున్న జస్కరన్ సింగ్ రూ.7 కోట్ల ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు.
పద్మ పురాణం ప్రకారం, జింక శాపం కారణంగా ఏ రాజు వంద సంవత్సరాలు పులిలా జీవించాల్సి వచ్చింది? అనే ప్రశ్నను అమితాబ్ సంధించాడు. ఈ ప్రశ్నకు ఏ) క్షేమధురిత్, బి) ధర్మదత్త, సి) మితధ్వజ, డి) ప్రభంజన అనే నాలుగు ఆప్షన్లు ఇవ్వగా.. జస్కరిన్ సింగ్ ‘(డి)’ అని సరైన సమాధానం చెప్పలేకపోయాడు. అయితే ఈ సీజన్లో మొదటి కోటి రూపాయల విజేతగా జస్కరన్ సింగ్ నిలిచాడు. కోటి రూపాయలు గెలుచుకున్న జస్కరన్ సంతోషం అంతా ఇంతా కాదు. జస్కరింగ్ ఈ షోలో పాల్గొనడానికి నాలుగేళ్లుగా ప్రయత్నించగా.. ఈ సీజన్లో ఎంపికయ్యాడు.
ఇక ఇదే షోను తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో టాక్ షో నిర్వహించారు. తొలి మూడు సీజన్లను నాగార్జున హోస్ట్గా చేయగా.. నాల్గొవ సీజన్ చిరంజీవి, ఐదొవ సీజన్ తారక్ చేశారు. ఈ షోలో కోటి రూపాయలు గెలుచుకున్న వాడిగా హైదరాబాద్కు చెందిన పోలీస్ అధికారి రాజా రవింద్ర చరిత్ర సృష్టించాడు.