అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ సినిమాల కన్నా కూడా గ్లామర్ షోతోనే ఎక్కువగా తన అభిమానులని అలరిస్తుంది. బ్యాక్ టూ బ్యాక్ ఫొటో షూట్స్ చేస్తూ వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్కి పిచ్చెక్కిస్తుంది. ఫొటోలలో జాన్వీ అందాల ఆరబోతకి నెటిజన్స్ మంత్ర ముగ్ధులు అవుతున్నారు. అయితే ఈ ముద్దుగుమ్మ తన భవిష్యత్తు పెళ్లి గురించి, అది ఎలా ఉండాలో చెప్పుకొచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
రీసెంట్గా జాన్వీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా, అందులో తను చేసుకోబోయే వ్యక్తి తెలివిగల వాడై ఉండాలని చెప్పింది. పెళ్లిని రెండు రోజుల వేడుకగా చేసుకుంటానని చెప్పిన ఈ ముద్దుగుమ్మ బ్యాచిలర్ పార్టీని కాప్రీ ఐలాండ్లో చేసుకుంటే, పెళ్లిని శ్రీవారి సన్నిధి అయిన తిరుపతిలో చేసుకుంటుందట. సంగీత్ని తన అమ్మ తిరుగాడిన ఇల్లు చెన్నైలోని మైలాపూర్లో ఉండగా అక్కడ చేసుకుంటానంటుంది.
ఇక రిసెప్షన్పై పెద్దగా ఇంట్రెస్ట్ లేదని పేర్కొంది. తోడిపెళ్లికూతురు విషయానికొస్తే, స్నేహితురాలు తనిషా సంతోషి , సోదరి ఖుషీ కపూర్, మరో సోదరి అన్షులా పాల్గొనడానికి ఇష్టపడుతున్నానని చెప్పింది. మ్యారేజ్ అయి వెళ్లిపొయేప్పుడు నాన్న, చెల్లి ఎమోషనల్ అవుతారు. అందుకే ఆ సమయంలో అన్షులా ఉంటే ప్రతి విషయాన్ని పర్యవేక్షిస్తుందని చెప్పుకొచ్చింది.