తమిళ స్టార్ హీరో సూర్య చివరిగా ఆకాశం నీ హద్దురా అనే సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు డిఫరెంట్ కంటెంట్తో ప్రేక్షకులకి థ్రిల్ పంచుతూ ఉండే సూర్య తాజాగా జై భీమ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సూర్య 40వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో సూర్య లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. సూర్య ను ఇప్పటి వరకు చూడని సరికొత్త పాత్రలో కనిపించాబోతున్నాడు దర్శకుడు.
ఇప్పటికే చిత్రానికి సంబంధించి విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. తాజాగా టీజర్ విడుదల చేశారు.ఇందులో మహిళలపై పోలీసులు దాడులు చేయడం, లేనిపోని కారణాలతో అమాయకులని వేధిస్తున్న నేపథ్యంలో లాయర్గాసూర్య వారికి అండగా నిలవనున్నట్టు తెలుస్తుంది. 1993 లో తమిళనాడులో గిరిజన యువతి కోసం సీనియర్ అడ్వకేట్ చంద్రు పోరాటం చేశారు. ఇప్పుడు ఇదే కథాంశం తో సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది.
ఈ సినిమాలో రజిషా విజయన్ హీరోయిన్గా నటిస్తోంది.. టీఎస్ జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. 2డీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్లో సూర్య చేస్తున్న నాలుగో చిత్రం ఇది కావడం మరో విశేషం.