DJ Tillu-2 Movie | టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సీక్వెల్స్లో డీజె టిల్లు ఒకటి. ఈ ఏడాది మార్చి 12న భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ చిత్రం.. అంతే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ను పూర్తి చేసుకుని డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపించింది. సెకండ్ వేవ్ తర్వాత సినిమాలు విడుదల చేయాలా? వద్ధా? అనే సంధిగ్ధంలో ఉన్న టాలీవుడ్ దర్శక నిర్మాతలకు ‘డీజే టిల్లు’ సినిమా ధైర్యాన్నిచ్చింది. ఎన్నో ఏళ్ళ నుంచి గుర్తింపు కోసం ఎదురు చేస్తున్న సిద్ధూకు ఈ చిత్రం విపరీతమైన క్రేజ్ తీసుకువచ్చింది. ముఖ్యంగా యూత్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం అదే జోష్తో ఈ సినిమా సీక్వెల్ టిల్లూ స్క్వేర్ తెరకెక్కుతుంది.
ఇటీవలే షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రానికి అడుగడుగున సమస్యలే ఎదురవుతున్నాయి. డీజే టిల్లు సక్సెస్తో సిద్ధూ తన కెరీర్ను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే సెకండ్ పార్ట్కు కూడా తనే స్వయంగా కథను రాసుకున్నాడు. ఇక స్క్రిప్ట్ విషయంలో విభేదాలు రావడంతో దర్శకుడు విమల్కృష్ణను పక్కన పెట్టి మరో కొత్త దర్శకుడితో సీక్వెల్ చేస్తున్నాడు. దర్శకుడి ప్రాబ్లం తొలిగించుకున్న టిల్లు గాడికి హీరోయిన్ల రూపంలో మరో సమస్య ఏర్పడింది. ఫస్ట్ పార్ట్లోనే నేహా శెట్టి పాత్రకు ముగింపు పడింది. సెకండ్ పార్ట్లో కొత్త హీరోయిన్ నటించనుంది.
కాగా కొత్త హీరోయిన్ కోసం టిల్లుగాడు పడుతున్న కష్టాలు మాములుగా లేవు. నేహాశెట్టికి తగ్గట్లు హీరోయిన్ను కనిపెట్టలేకపోతున్నాడు. సీక్వెల్లో ముందుగా అనుపమ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. అయితే షూటింగ్ స్టార్ట్ అయిన కొన్ని రోజులకే అనుపమ సినిమా నుండి తప్పకున్నట్లు ప్రకటన వచ్చింది. ఆ తర్వాత అనుపమ ప్లేస్లోకి శ్రీలీల వచ్చింది. కారణమేంటో తెలియదు కానీ ఈమె కూడా కొన్ని రోజులకే ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఇక ఇటీవలే ప్రేమమ్ బ్యూటీ మడోన్నా హీరోయిన్గా ఎంపికైందని వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై క్లారిటీ వచ్చే లోపే మరో కథానాయిక లైన్లోకి వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
హిట్-2తో సూపర్ సక్సెస్ సాధించిన మీనాక్షి చౌదరీని ఇప్పుడు టిల్లు గాడికి గర్ల్ ఫ్రెండ్గా సెట్ చేయ్యబోతున్నట్లు తెలుస్తుంది. మరీ ఈమెనైనా ప్రాజెక్ట్లో ఉంటుందా తప్పుకుంటుందా అని పలువురు నెటీజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా నుండి హీరోయిన్లు తప్పుకోవడానికి ఒక పెద్ద కారణం ఉన్నట్లు తెలుస్తుంది. కాగా డీజె టిల్లు సక్సెస్లో నేహాశెట్టి కూడా ముఖ్య పాత్ర పోషించింది. తన అందాల ఆరబోత, రొమాన్స్కు యూత్ రీపీటెడ్గా వచ్చారు. ఈ క్రమంలో సీక్వెల్లో మరింత ఘాటుగా రొమాన్స్ ఉంటుందని తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్లు ఎక్కువగా ఉన్నాయట. కాగా ఈ కారణాల వల్లే హీరోయిన్లు సినిమా నుండి తప్పుకుంటున్నారట. ఏడాది చివర్లోపైనా టిల్లుగాడికి హీరోయిన్ దొరుకుందా లేదా అనేది చూడాలి.