Asia Cup 2023 | ఆసియాకప్-2023లో దాయాదుల పోరుకు సమయం ఆసన్నమైంది. నేడు పల్లెకిలే వేదికగా భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల క్రికెట్ అభిమానులు అతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఆసియాకప్లో పాకిస్తాన్పై భారత్దే పైచేయిగా ఉంది. మరోసారి చిరకాల ప్రత్యర్థిపై అధిపత్యం చెలాయించాలని టీమిండియా భావిస్తున్నది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు భారత్ అన్ని విధాల సిద్దమైంది. ఈ క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది.
నేడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు సందర్భంగా ఓజీ మేకర్స్ గ్లింప్స్ను (OG Glimpse) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో టాప్ 1 ట్రెండింగ్లో దూసుకుపోతుంది. కాగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్, ఓజీ గ్లింప్స్ ఈ రెండు విషయాలు సెప్టెంబర్ 02 జరుగుతున్నట్లు సన్ రైజర్స్ హైదరాబాద్ ఓ పోస్టు పెట్టింది.
“సెప్టెంబర్ 2న మన పవర్ ఫుల్ స్టార్స్ కి ప్రత్యేక రోజు.. మేము అతనిని ఓజీ (పవన్ కల్యాణ్ ఓజీ) బ్రదర్ అని పిలుస్తాము. మేము దీనిని ఓజీ యుద్ధం (భారత్-పాకిస్తాన్ మ్యాచ్) అని పిలుస్తాము” అంటూ ట్విట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్విట్ వైరల్గా మారింది.
Sep 2⃣: A special day for our 𝗽𝗼𝘄𝗲𝗿-packed 𝘀𝘁𝗮𝗿s 🌟🔥 pic.twitter.com/KNEcHcuqAA
— SunRisers Hyderabad (@SunRisers) September 2, 2023
ఇదిలా ఉండగా సూపర్ థ్రిల్లర్ కోసం టాస్ పడింది. పాక్తో జరగనున్న మ్యాచ్లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. ఆసియాకప్లో భాగంగా పల్లెకిలేలో ఈ మ్యాచ్ జరుగుతోంది.