అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘హ్యాపీ జర్నీ’. అభిరామ్ నాయుడు దర్శకుడు. బాలాజీ గుత్తా, కౌశిక్రెడ్డి నిర్మాతలు. ఇటీవలే సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో సక్సెస్మీట్ నిర్వహించారు.
ప్రధాన పాత్రలు పోషించిన ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, సునైనా సినిమాలో భాగం కావడం పట్ల ఆనందం వెలిబుచ్చారు. అంతా కుటుంబసమేతంగా ఈ సినిమా చూస్తున్నారని దర్శకుడు అభిరామ్ నాయుడు ఆనందం వెలిబుచ్చారు. ఇంకా వంశీ కూడా మాట్లాడారు.