Guntur Kaaram | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన గుంటూరు కారం (Guntur Kaaram) ట్రైలర్ వచ్చిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా.. విడుదలై 24 గంటలు కాకముందే యూట్యూబ్లో రికార్డు వ్యూస్తో దూసుకుపోతుంది. ఇక చాలా రోజులుగా ఆకలితో పస్తులుంటున్న అభిమానులకు ఈ ట్రైలర్ ఫుల్ మీల్స్ పెట్టినట్లయింది. అయితే ఈ ట్రైలర్ విడుదల అయిన అనంతరం మూవీలోని ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇంతకీ ఆ విషయం ఏంటంటే.. ఈ సినిమాలో మహేష్ బాబుకు ఎడమ వైపు కంటి చూపు కోల్పోయినట్లు తెలుస్తుంది. ట్రైలర్లో కూడా మహేష్ కంటిలో నిప్పు రవ్వ పడడం, మహేష్ చూపు కూడా కుడివైపు నుంచి ఫోకస్ చేయడం వంటివి చూడవచ్చు. మరోవైపు మహేష్కు మోనోక్యులర్ విజన్ (రెండు కండ్లకు వేరు వేరు విజన్లు ఉండటం) ఉన్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇందులో ఏది నిజం అనేది తెలియాలంటే జనవరి 12న సినిమా చూడాల్సిందే.
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వం వస్తున్న ఈ చిత్రంలో శ్రీలీలా, మీనాక్షి చౌదరి కథనాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Morning Evarooo #GunturKaaram Cinemalo Babu ki Monocular Vision ani Annaaru, Nijamenemo? pic.twitter.com/1ffJyptiWG
— Movies4u Official (@Movies4u_Officl) January 7, 2024
yes ippude anukunna https://t.co/NSnh7T3oq7 pic.twitter.com/wbMhtUInPt
— KARTHIK REDDI (@karthikreddi7) January 7, 2024