అడివి శేష్ నటించిన ‘గూఢచారి’ చిత్రం స్పై యాక్షన్ థ్రిల్లర్గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీనికి సీక్వెల్గా ‘గూఢచారి-2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వినయ్కుమార్ సిరిగినీడి దర్శకుడు. బాలీవుడ్ భామ బనితా సంధు కథానాయికగా నటిస్తున్నది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో మొదలైంది. దర్శకుడు మాట్లాడుతూ ‘సక్సెస్ఫుల్ గూఢచారి ఫ్రాంఛైజీలో వస్తున్న ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. తన దేశాన్ని ముష్కరుల బారి నుంచి రక్షించడానికి విదేశంలో ఓ గూఢచారి చేపట్టిన ఆపరేషన్ ఏమిటి? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఆద్యంతం ఉత్కంఠను కలిగిస్తాయి. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించబోతున్నాం. తాజా షెడ్యూల్ కోసం హైదరాబాద్లో భారీ వ్యయంతో ఓ గ్లాస్ సెట్ను నిర్మించాం. తొలి భాగం తరహాలోనే ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.