హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతిక కాయానికి సినిప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్న సీతారామశాస్త్రి మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్లోని ఫిల్మ్చాంబర్కు తరలించారు. దర్శకులు రాజమౌళి, గుణశేఖర్, ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, హీరో వెంకటేశ్, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సీనియర్ నటులు తనికెళ్ల భరణి, రావు రమేష్, ఇతర సినీ ప్రముఖులు, అభిమానులు సిరివెన్నల భౌతికకాయానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అభిమానుల చివరిచూపు అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.