AI Product Company | టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు సినీ రంగంలో మరో వినూత్న ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాడు. క్వాంటం ఏఐ గ్లోబల్తో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత మీడియా కంపెనీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ కొత్త వెంచర్ ద్వారా సినీ రంగంలో అత్యాధునిక ఏఐ సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో మే 4న కంపెనీ పేరు సహా పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. ఈ ప్రకటనను దిల్ రాజు యొక్క శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా విడుదల చేసింది, ఈ సందర్భంగా ఓ వీడియోను కూడా షేర్ చేశారు.
ఈ కొత్త కంపెనీ వినోద రంగానికి ప్రత్యేకంగా రూపొందించిన అధునాతన ఏఐ సాధనాలను అభివృద్ధి చేసి అందించనుంది. దిల్ రాజు ఈ సహకారం గురించి మాట్లాడుతూ, సినిమా నిర్మాణంలో ఏఐ సాంకేతికత ద్వారా కొత్త అవకాశాలను సృష్టించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ ప్రకటన సినీ అభిమానులు, ఇండస్ట్రీ నిపుణులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.