Deepika padukone | బాహుబలి సినిమాతో టాలీవుడ్ స్థాయి పెరిగింది. వరల్డ్ సినిమా ఇప్పుడు టాలీవుడ్ వైపు చూస్తుంది. బాలీవుడ్లో మనకు గౌరవం లేదు అనే స్థాయి నుండి టాలీవుడ్ సినిమా వస్తుందటే బాలీవుడ్ సినిమాలు పోస్ట్ పోన్ చేసుకునే స్థాయికి వచ్చింది. టాలీవుడ్ స్టార్ హీరోలతో ఒక్క సినిమాలో అయినా నటించాలని బాలీవుడ్ హీరోయిన్లు ఆశపడుతున్నారు. తాజాగా దీపికా పదుకొనే కూడా తన మనుసులో మాట బయపెట్టింది. ప్రస్తుతం దీపికా పదుకొనే నటించిన గెహ్రైయాన్ అమేజాన్లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఈనేపథ్యంలో ఓ ఆన్లైన్ ఇంటర్వూలో పాల్గొన్న దీపికా..తనకు జూ.ఎన్టీఆర్ ,అల్లు అర్జున్తో నటించాలని ఉందని తెలిపింది. ఎన్టీఆర్ పర్స్నాలిటీ నచ్చుతుందని తన యాక్టింగ్ స్కిల్స్ బాగుంటాయిని వెల్లడించింది. ప్రస్తుతం దీపికా ప్రభాస్కు జోడిగా ప్రాజెక్ట్-Kలో నటిస్తుంది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అత్యంత భారీ బడ్జెట్తో వైజయంతి క్రియేషన్స్ బ్యానర్పై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. బిగ్బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించనున్నాడు.