Venkatesh | వెంకటేశ్ది భిన్నమైన ఇమేజ్. ఆయనకు దురాభిమానులంటూ ఉండరు. మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా వెంకటేశ్ ఫ్యాన్సే. ఆయన్ను అభిమానించని వాళ్లు తెలుగునేలపై ఉండరంటే అతిశయోక్తి కాదు. జయాపజయాలకు అతీతమైన స్టార్డమ్ వెంకీది. రీసెంట్గా ‘సైంధవ్’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన వెంకీ.. తరువాతి ప్రయత్నంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్ చేయనున్నారని విశ్వసనీయ సమాచారం. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తారట. త్వరలో షూటింగ్ మొదలుపెట్టి, సంక్రాంతికి విడుదల చేయాలనే టార్గెట్తో ముందుకెళ్తున్నారట దిల్రాజు.
దానికి తగ్గట్టే ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ని ఈ సినిమాకు ఖరారు చేశారట. ఇటీవలే దిల్రాజు ఈ టైటిల్ని రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తున్నది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్లో ఇద్దరు స్టార్ హీరోలు అతిథి పాత్రలు పోషించనున్నారట. వారెవరో కాదు.. నందమూరి బాలకృష్ణ, రవితేజ. వీరిద్దరినీ ఇప్పటికే అనిల్ రావిపూడి ఒప్పించారని తెలుస్తున్నది. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించనున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే.. పక్కా పండగ సినిమాగా ఈ మూవీని అనిల్ తెరకెక్కిస్తారనడంలో ఎలాంటి సందేహంలేదు.