RRR Pre-Release Event | ఇండియాస్ మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీస్లో ‘ట్రిపుల్ ఆర్’ ఒకటి. కేవలం సౌత్లోనే కాకుండా నార్త్ ప్రేక్షకులు కూడా ఈ సినిమా గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఐదు సార్లు పోస్ట్ పోన్ అయిన ఈ చిత్రాన్ని ఈసారి ఎట్టిపరిస్తితుల్లో మార్చి 25న ప్రేక్షకుల మందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్లను ప్రారంభించే పనిలో ఉంది. ఈ క్రమంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలను ముఖ్య అథితులుగా పిలవాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట.
రాజమౌళి టేకింగ్ మాత్రమే కాదు ఈయన ప్రమోషన్లు కూడా ఓ రేంజ్లో ఉంటాయి. ఈ చిత్రాన్ని గ్రాండ్గా ప్రమోషన్లు జరిపేందుకు జక్కన్న భారీ ప్లాన్ చేస్తున్నాడట. ఈ క్రమంలో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణను ముఖ్య అథితులుగా పిలువనున్నట్లు సమాచారం. దీనిగురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. రామ్చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దానయ్య డివివి అత్యంత భారీగా నిర్మించాడు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, ట్రైలర్ సినిమాపైన భారీ అంచనాలను నమోదు చేశాయి. ఆలియాభట్, ఒలీవియా మోర్రిస్ కథానాయికలుగా నటించారు.