పంకజ్ త్రిపాఠి, దివ్యేందు, అలీ ఫజల్ ప్రధానపాత్రల్లో నటించిన క్రైమ్ యాక్షన్ డ్రామా ‘మీర్జాపుర్ ది మూవీ’. బ్లాక్బస్టర్ వెబ్సిరీస్ ‘మిర్జాపూర్’కి సీక్వెల్గా రూపొందిన ఈ సినిమాకు గుర్మీత్ సింగ్ దర్శకుడు. రితేష్ సిధ్వాని, ఫర్హాన్ అక్తర్ నిర్మాతలు. ఈ నెల 4న హిందీ, తెలుగు భాషల్లో ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా బృందం హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించారు. మీర్జాపూర్ ప్రపంచం వెండితెరపైకి రావడం ఆనందంగా ఉందని, ఇందులో తాను పోషించిన కాలీన్ భయ్యా పాత్ర తెలుగువారిని కూడా బాగా ఆకట్టుకున్నదని నటుడు పంకజ్ త్రిపాఠి అన్నారు.
సిరీస్ ఎంత రియలిస్టిక్గా ఉంటుందో, సినిమా కూడా అంతే రియలిస్టిక్గా ఉంటుందని, సిరీస్లో ఉన్న పాత్రలే ఇందులోనూ ఉన్నా, పరిస్థితులు మాత్రం కొత్తగా ఉంటాయని నటుడు దివ్యేందు శర్మ చెప్పారు. తెలుగులో ‘మీర్జాపూర్’కి పెద్ద ఫ్యాన్ బేస్ ఉందని, అందుకే తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్నామని దర్శకుడు గుర్మీత్ సింత్ తెలిపారు. ఇంకా పాత్రధారులు అలీ ఫజల్, రవికిషన్, జితేంద్రకుమార్, రసిక దుగల్, సోనాల్ చౌహాన్, శ్వేతా త్రిపాఠి, శ్రియా, హర్షిత్ గౌర్ కూడా మాట్లాడారు.