Anupama Parameswaran | ‘టిల్లు స్వేర్’ చిత్రంతో ఇటీవలే మంచి విజయాన్ని దక్కించుకుంది మలయాళీ సోయగం అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం ఈ భామ విభిన్న కథాంశాలను ఎంచుకొని సినిమాలు చేస్తున్నది. తమిళంలో కూడా ఈ అమ్మడికి మంచి అవకాశాలొస్తున్నాయి. ఆమె తాజా తమిళ చిత్రం ‘లాక్డౌన్’ ఫస్ట్లుక్ పోస్టర్ను సోమవారం విడుదల చేశారు. ఈ చిత్రానికి ఏ.ఆర్.జీవా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్నది.
ఫస్ట్లుక్ పోస్టర్లో అనుపమ పరమేశ్వరన్ భయంతో ఏడుస్తూ కనిపిస్తున్నది. లాక్డౌన్ నేపథ్యంలో నడిచే థ్రిల్లర్ కథాంశమిదని, స్క్రీన్ప్లే సరికొత్తగా ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ సినిమాతో పాటు తమిళంలో అనుపమ పరమేశ్వరన్ ‘బైసన్ కాలమాదన్’ అనే తమిళ చిత్రంలో కూడా నటిస్తున్నది. ధృవ్ విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో రూపొందిస్తున్నారు. మారి సెల్వరాజ్ దర్శకుడు. ప్రస్తుతం తెలుగులో ‘పరదా’ చిత్రంలో నటిస్తున్నది అనుపమ పరమేశ్వరన్.