హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. టాలీవుడ్లోనూ కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే మహేశ్బాబు, మంచు లక్ష్మీ, సత్యరాజ్, రాజేంద్రప్రసాద్, త్రిష సహా పలువురు కరోనా బారిన పడ్డారు. తాజాగా నటి, దర్శకురాలు రేణుదేశాయ్, ఆమె కుమారుడు అకీరా కరోనా పాజిటివ్గా నిర్ధారించబడ్డారు. ఈ మేరకు రేణు దేశాయ్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
కరోనా విజృంభణ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇంట్లోనే ఉన్నప్పటికీ నేను, అకీరా కరోనా బారిన పడ్డాం. కొన్ని రోజుల క్రితం కరోనా లక్షణాలు స్వల్పంగా కనిపించాయి. దీంతో కొవిడ్ టెస్టులు చేయిస్తే పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఇద్దరం కొవిడ్ నుంచి కోలుకుంటున్నాం. నేను ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నాను. అయినప్పటికీ నాకు కరోనా సోకింది. అకీరాకి వ్యాక్సిన్ వేయిద్దాం అనుకునే లోపే అతడికి కూడా కరోనా వచ్చింది. ఈ థర్డ్ వేవ్ను చాలా సీరియస్గా తీసుకోండి. మాస్కులు ధరించండి. జాగ్రత్తగా ఉండండి అంటూ రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారు.