చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఆచార్య’. నిరంజన్రెడ్డి, అన్వేష్రెడ్డి నిర్మాతలు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాలోని ‘సానా కష్టం వచ్చేసిందే మందాకిని’ అంటూ సాగే గీతాన్ని సోమవారం విడుదల చేశారు. ఈ గీతాన్ని చిరంజీవి, రెజీనాలపై చిత్రీకరించారు. భాస్కరభట్ల రచనలో రేవంత్, గీతామాధురి ఆలపించారు. హుషారైన బీట్తో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే గీతమిదని, విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్మీడియాలో అందరిని ఆకట్టుకుంటున్నదని చిత్రబృందం తెలిపింది.