హైదరాబాద్ : నేరెళ్ల మాజీ ఎమ్మెల్యే ఉప్పరి సాంబయ్య (80) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం కరీంనగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నేరెళ్ల ఎమ్మెల్యేగా సాంబయ్య పనిచేశారు. 1985లో జనతాదళ్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా సాంబయ్య విజయం సాధించారు.
1985 నుంచి 1989 వరకు నేరెళ్ల ఎమ్మెల్యేగా ఆయన సేవలందించారు. ఉప్పరి సాంబయ్య మృతిపట్ల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సంతాపం వ్యక్తంచేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి