న్యూఢిల్లీ, డిసెంబర్ 5: విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్ సంస్థ తన వ్యాపార పరిధిని మరింత విస్తరించబోతున్నది. ఇప్పటికే సంతూర్ పేరుతో సబ్బులను విక్రయిస్తున్న సంస్థ తాజాగా మరో బ్రాండ్లను కొనుగోలు చేసినట్టు ప్రకటించింది. వీటిలో వీవీఎఫ్(ఇండియా)కు చెందిన జో, డాయ్, బాక్టర్ షీల్డ్లను కైవసం చేసుకున్నది.
ఎంతకు కొనుగోలు చేసిన విషయాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు. వ్యక్తిగత ఉత్పత్తుల పరిమితిని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఈ బ్రాండ్లను కొనుగోలు చేసినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. అజీం ప్రేమ్జీకి చెందిన విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్ గడిచిన ఏడాది కాలంలో మూడో కొనుగోలు ఒప్పందం కావడం విశేషం.