Tax Slabs | నూతన ఆర్థిక సంవత్సరం మొదలై అప్పుడే 2 నెలలు కావస్తోంది. ఇప్పటికే చాలామంది ఉద్యోగులకు తమ హెచ్ఆర్ శాఖల నుంచి పన్ను పొదుపు స్కీములపై, కొత్త-పాత పన్ను విధానాల ఎంపికపై క్లారిటీ ఇవ్వాలని సమాచారం కూడా అంది ఉండొచ్చు. అందుకే ఉద్యోగుల్లో కూడా మెల్లిగా ఒత్తిడి బయలుదేరింది. కొత్త-పాత పన్నుల విధానంలో ఏది ఎంపిక చేసుకోవాలి అనేది కేస్ టు కేస్పై ఆధారపడిన అంశం. సాధారణంగా రూ.7 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉండి, ఎలాంటి ట్యాక్స్ రిబేట్ స్కీముల్లో పెట్టుబడి పెట్టనివాళ్లు కొత్త పన్నుల విధానాన్ని ఎంపిక చేసుకోవడం మంచిది. అలాకాకుండా సెక్షన్ 80సీని పూర్తిగా వాడుకోవడం, హౌజింగ్ లోన్స్, ఎన్పీఎస్.. ఇలా వివిధ సెక్షన్ల కింద ట్యాక్స్ డిడక్షన్ స్కీములను వినియోగించుకుంటున్నప్పుడు పాత విధానమే ఉత్తమం. ఏదేమైనా ఒకసారి మీ ప్లానర్ దగ్గర క్లారిటీ తీసుకోవడం మంచిది. అయినా ఇప్పటికైతే ఉద్యోగుల వరకు ఏ ఏడాదికి ఆ ఏడాది రెండు విధానాల్లో ఏది మంచిదో ఎంపిక చేసుకునే సౌలభ్యాన్ని కల్పించారు. ఇదిలా ఎంతకాలం ఉంటుందో మాత్రం ఇప్పుడే చెప్పడం కష్టమే.
కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు పోతుందనేది పెద్దల మాట. అయితే ఇప్పుడు మాత్రం ఆ సామెత మనకు పనికిరాకపోవచ్చనిపిస్తోంది. ఎందుకంటే కొత్త ట్యాక్స్ విధానంలోకి వెళ్లినప్పుడు పాత విధానంలో కొనసాగించిన పెట్టుబడులను ఉంచాలా?, తీసేయాలా? అనే చర్చ కూడా వస్తుంది. సాధారణంగా మనం ఎప్పుడు ట్యాక్స్ తగ్గించుకోవడానికే ఆరాటపడుతాం. అందుకు తగ్గట్టే ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తాం. కానీ ఇప్పుడు అలాంటి అవసరమే లేదనిపించినప్పుడు వాటి జోలికే వెళ్లం అనడంలో సందేహం లేదు. అయితే ఫైనాన్షియల్ ప్లానింగ్లో ట్యాక్స్ అనేది ఒక భాగం మాత్రమే. పన్ను తగ్గింపు కోసమే మనం పెట్టుబడులు పెట్టకూడదు. అందుకే గతంలో కొనసాగించిన వాటిని పూర్తిగా పక్కనపడేసి, ఆ డబ్బులు తీసేసుకుని వేరే వాటిల్లోకి మళ్లించడం అనేది సరైన పద్ధతి కాదు.
మూడేండ్ల లాక్ఇన్ పీరియడ్ ఉండే ఈ మార్కెట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కీములకు మంచి ఆదరణ ఉన్నది. కొన్ని సందర్భాల్లో కొన్ని ఫండ్స్ ఏకంగా 15 శాతం వరకూ రాబడి ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు సెక్షన్ 80సీ కింద బెనిఫిట్స్ రావు కాబట్టి బయటకు రావడం మంచిది. మూడేండ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత వచ్చిన మెచ్యూరిటీ మొత్తాన్ని ఏదైనా టాప్ పర్ఫార్మింగ్ ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. పర్ఫార్మెన్స్ ఎంత బాగున్నా.. ఈ స్కీమ్స్ పెట్టుబడి విధానం లాంగ్ టర్మ్ కాబట్టి రెగ్యులర్ ఈక్విటీ స్కీములతో పోలిస్తే రాబడులు కాస్త తక్కువే ఉంటాయి.
ట్యాక్స్ తగ్గించుకునేందుకు మరో మార్గం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ లేదా కనీసం ఐదేండ్ల పరిమితి ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు). వీటిని పూర్తిగా సెక్షన్ 80సీ కోసమే చేసి ఉంటే మాత్రం.. మెచ్యూరిటీ టైమ్కల్లా తీసేయడం మంచిది. ఎందుకంటే ఇంత దీర్ఘకాలం కోసం, తక్కువ రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు.
ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్స్ను కలిపే ఈ స్కీములు కూడా అధిక శాతం ట్యాక్స్ సేవింగ్స్ను దృష్టిలో పెట్టుకుని విక్రయించినవే. మీకు మంచి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండి, మార్కెట్స్ గురించి అవగాహన ఉంటే వీటిని వదిలించుకోవడం మంచిది. ఇన్సూరెన్స్ తీసుకుని, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్వైపు మీ పెట్టుబడులు మళ్లించండి. కొత్త పన్ను విధానంలోకి మారుతున్నప్పుడు ఈ యూలిప్స్ను కొనసాగించాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు.
ఆడపిల్లలున్న తల్లిదండ్రులకు ఇదో మంచి పెట్టుబడి సాధనం. 8 శాతానికిపైగా స్థిరమైన రాబడిని అందిస్తూ, పూర్తి ప్రభుత్వ భరోసా ఉన్న ఈ స్కీముల్లో పెట్టుబడులు కొనసాగించడం బెటర్. కొత్త పన్ను విధానం ఎంపిక చేసుకున్నా సరే.. సుకన్య సమృద్ధి స్కీమ్లో పెట్టుబడులు ఆపవద్దు.
కరోనా తర్వాత ఆరోగ్య బీమా పాలసీలపై అవగాహన పెరిగింది. అనారోగ్యంలో తోడుగా ఉండ టం ఒక పాజిటివ్ అయితే, రెండోది ట్యాక్స్ సేవింగ్. అందుకే మన తల్లిదండ్రులకు కూడా హెల్త్ పాలసీలు తీసుకోవడానికి ఆసక్తిని చూపి స్తూ వచ్చాం. ఇప్పుడు కొత్త పన్ను విధానానికి మారాలని అనుకుంటున్నప్పుడు వీటి జోలికి మాత్రం వెళ్లకండి. హెల్త్, లైఫ్ పాలసీలను అలానే కంటిన్యూ చేయండి. వీటిని మీరు ఏ మాత్రం ముట్టుకున్నా ఎగ్జిస్టింగ్ ఇల్నెస్, నో క్లెయిం బోనస్ వంటి వాటిని కోల్పోయే ప్రమాదం ఉంది. పన్ను విధానం కొత్తదైనా, పాతదైనా ఆరోగ్య, జీవిత బీమా పాలసీలను కొనసాగించండి.
-నాగేంద్ర సాయి కుందవరం
ఎలాంటి పన్నూ లేకుండా పెద్ద ఎత్తున కార్పస్ ఏర్పాటు చేసుకునేందుకు ఇదో అద్భుత విధానం. ఇప్పుడున్న పరిస్థితుల్లో సుమారు 7.1 శాతం రిటర్న్స్ ఇందులో వస్తున్నాయి. పూర్తిగా టెన్షన్ ఫ్రీ, ట్యాక్స్ ఫ్రీ, రిస్క్ ఫ్రీ కూడా. మీరు ఒకవేళ కొత్త విధానంలోకి మారినా ఇందులో మాత్రం మీ పెట్టుబడులు కొనసాగించండి. ఎందుకంటే పెట్టుబడిపై వచ్చే ఇంట్రెస్ట్పైనా, ఆ తర్వాత వచ్చే మెచ్యూరిటీ సొమ్ముపై కూడా ఎలాంటి ట్యాక్స్ లేదు కాబట్టి ఇదో మంచి పెట్టుబడి సాధనం. వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్లో పెట్టుబడి పెట్టేవాళ్లు పీపీఎఫ్ వైపు తమ ఇన్వెస్ట్మెంట్స్ను మళ్లించడం బెటర్.
ఒకవేళ కొత్త పన్ను విధానంలోకి మారడం వల్ల 4 రూపాయలు మిగిలితే.. వాటిని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రయత్నించండి. మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు ఈ కార్పస్ ఎంతగానో సహాయ పడుతుందని మర్చిపోవద్దు. పన్ను ప్రయోజనాల కోసమే ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవద్దు. మీ దీర్ఘకాల లక్ష్యాల ఆధారంగా ఆర్థిక ప్రణాళిక చేసుకోండి. నెట్వర్త్ ఎంతుందో ఏడాదికి ఒకసారైనా విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవడం లాభదాయకం.