న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: ఐఫోన్లను యాపిల్ దేశంలో ఉత్పత్తి చేస్తున్నందున, వాటి ధరలు దిగివస్తాయనుకున్న వినియోగదారుల ఆశలు గల్లంతయ్యాయి. యాపిల్ తాజాగా విడుదల చేసిన ఐఫోన్ 15 మోడల్ను భారత్లో తయారు చేస్తున్నప్పటికీ, ఆ ఫోన్ ధర అమెరికా, దుబాయ్లకంటే ఇక్కడే ఎక్కువ. స్థానికంగా ఐఫోన్ 15 ఇక్కడ ఉత్పత్తవుతుండగా, ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్ తయారీ ఇతర దేశాల్లో జరుగుతున్నది. భారత్లో ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్ (1 టెర్రాబైట్) ధర రూ.1,99,000 ఉన్నది. యూఎస్లో దీని ధర 1,599 డాలర్లతో (రూ.1,32,717) పోలిస్తే ఇక్కడ 51 శాతం ఎక్కువ.
ఇక దేశంలో తయారయ్యే మోడల్స్ అయితే అమెరికాలో అమ్మకపు ధరకంటే 20 శాతం అధికం. ఐఫోన్ 15 దుబాయ్లో 3,399 దీనార్లకు (రూ.76,817) లభిస్తుండగా, ఇక్కడ కాస్త ఎక్కువ. ప్రొ వెర్షన్లు అయితే 22 శాతం దిగుమతి సుంకం వర్తిస్తున్నందున, వీటి ధరల వ్యత్యాసం మరీ అధికం. ఐఫోన్ 15 ప్రొ బేస్ వేరియంట్ ధర భారత్లో రూ.1,34,900 కాగా, యూఎస్లో రూ.82,917, రూ.97,157. ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్ దేశంలో రూ.1,59,900, యూఎస్లో రూ.99,517, దుబాయ్లో రూ. 1,15,237 చొప్పున ధర ఉంది.
దిగుమతి సుంకాలే ప్రధాన కారణం
పూర్తి ఫోన్సెట్ దిగుమతులపైనే కాకుండా, భారత్లో అసెంబుల్ అయ్యే ఫోన్ల విడిభాగాలపై కస్టమ్స్ సుంకాలు చెల్లించాల్సిందే. పలు విడిభాగాలకు సుంకాల చెల్లించిన తర్వాత ఇక్కడ అసెంబ్లింగ్ జరుగుతుందని, ఐఫోన్ల ధర అధికంగా ఉండటానికి ఇది ప్రధాన కారణమని యాపిల్ డిస్ట్రిబ్యూటర్ ఒకరు చెప్పా రు. ఈ సుంకాలే కాకుం డా, ఐఫోన్ల తయారీ, సరఫరా తదితర అంశాలకు పలువురు భాగస్వాములతో టైఅప్ అవుతుందని, వాటి వ్య యాలతో కలుపుకుని తుది ధరల్ని నిర్ణయిస్తారని సైబర్మీడియా రీసెర్చ్ ఇండస్ట్రీ ఇంటిలిజెన్స్ హెడ్ ప్రభురామ్ తెలిపారు.
‘అసెంబుల్డ్ ఇన్ ఇండియా’ లేబుల్ ఉన్నంతమాత్రాన ఐఫోన్లు చౌకగా లభిస్తాయని భావించవద్దని ఐడీసీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ నవకేందర్ సింగ్ చెప్పారు. నాన్-ప్రొ మోడల్స్ను ఇక్కడ అసెంబుల్ చేయడంతో కొంత విదేశీ మారకం పొదుపు అవుతున్నప్పటికీ, కొత్తగా విడుదల చేసిన ఐఫోన్ల ధరల్ని యాపిల్ తగ్గించదని, అందుకు బదులుగా మార్కెటింగ్, సప్లయ్చైన్ల కోసం పెట్టుబడి చేస్తుందని వివరించారు.