హైదరాబాద్, జనవరి 29: రాష్ర్టానికి చెందిన రక్షణ విమాన ఇంజిన్ విడిభాగాల తయారీ సంస్థ ఆజాద్ ఇంజినీరింగ్..తాజాగా రోల్స్-రాయిస్తో జత కట్టింది. ఇరు సంస్థలు కలిసి రక్షణ ఏరో-ఇంజిన్ విడిభాగాలు హైదరాబాద్లో తయారు చేయనున్నది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఈ దీర్ఘకాలిక ఒప్పందంలో భాగంగా హైదరాబాద్ యూనిట్లో తయారుకానున్న ఏరో-ఇంజిన్ విడిభాగాలు అంతర్జాతీయంగా సరఫరా చేయనున్నాయి.
ఈ సందర్భంగా రోల్స్-రాయిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అలెక్స్ జినో మాట్లాడుతూ.. భారత్లో ఇప్పటికే పలు ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగిందని, ముఖ్యంగా డిఫెన్స్ ఏకోసిస్టాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా ఆజాద్ ఇంజినీరింగ్తో జతకట్టినట్టు చెప్పారు. కీలకమైన విడిభాగాలను భారత్కు తీసుకురావడానికి ఈ ఒప్పందం దోహదం చేయనున్నదని ఆజాద్ ఇంజినీరింగ్ సీఈవో రాకేశ్ చోప్దార్ అన్నారు.