NSE Co-Location Case | నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) కో-లొకేషన్ కేసులో ఆ సంస్థ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణకు ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీని నాలుగు రోజులు పొడిగించింది. చిత్రా రామకృష్ణతోపాటు ఎన్ఎస్ఈ మాజీ సీఈవో రవి నరైన్, ముంబై మాజీ నగర పోలీస్ కమిషనర్ సంజయ్ పాండేలపై హవాలా లావాదేవీల నిరోధక చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. స్టాక్ మార్కెట్ల సిబ్బంది ఫోన్ ట్యాపింగ్చేశారని వీరిపై ఆబా అభియోగాలు మోపింది.
ఎన్ఎస్ఈ మాజీ సీఈవోలు రవి నరైన్, చిత్రా రామకృష్ణ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సంజయ్ పాండే కలిసి చట్ట విరుద్ధంగా స్టాక్మార్కెట్ల సిబ్బంది ఫోన్ కాల్స్ ట్యాప్ చేశారని ఆరోపిస్తూ ఇంతకుముందు సీబీఐ కేసు నమోదు చేసింది. తాజాగా సంజయ్ పాండేతోపాటు రవి నరైన్, చిత్రా రామకృష్ణ, ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న ఐసెక్ సర్వీసెస్ తదితర సంస్థలు వ్యక్తులపై ఈడీ కేసు నమోదు చేసింది.