న్యూఢిల్లీ: ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న లాంబోర్గిని హురాకాన్ ఎవో ఓపెన్ టాప్ కారు ఇండియాలో లాంచ్ అయింది. ఈ లాంబోర్గిని హురాకాన్ ఎవో ఆర్డబ్ల్యూడీ స్పైడర్ గతేడాదే అంతర్జాతీయ మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ కొత్త కారు ధర రూ.3.54 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ కొత్త మోడల్ అందమైన బ్లూ సెడిరిస్ కలర్లో లాంచ్ అయింది. లాంబోర్గినికి ఇండియా వ్యూహాత్మక మార్కెట్లలో ఒకటని, తమ కస్టమర్లకు ఎప్పటికప్పుడు యూనిక్ ఎక్స్పీరియన్స్ అందిస్తూనే ఉంటామని లాంచ్ సందర్భంగా లాంబోర్గిని ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ అన్నారు.