హైదరాబాద్, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ): ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను తెలంగాణ వాణిజ్య, పారిశ్రామిక మండళ్ళ సమాఖ్య(ఎఫ్టీసీసీఐ) ఉపాధ్యక్షులుగా సుధాకర్ పీవీసీ ఉత్పత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మీల జయదేవ్ ఎన్నికయ్యారు. ఎఫ్టీసీసీఐ మేనేజింగ్ కమిటీ సోమవారం సమావేశమై జయదేవ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపింది.