హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఆధ్వర్యంలో పది కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించారు. సోమవారం హైదరాబాద్లోని సనత్నగర్లోగల ఆడిటోరియంలో స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీబీలో ఉత్తమ ఉత్పత్తి విధానాలు అవలంభించిన పది పరిశ్రమలకు ఉత్తమ ప్రోత్సాహక ఇండస్ట్రీ సర్టిఫికెట్ అందించారు. వీటిలో ఐటీసీ (భద్రాచలం), బీహెచ్ఈఎల్(గండిమైసమ్మ), ఎన్న్టీపీసీ (రామగుండం), హెచ్బీఎల్ (నందిగాం), పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ (తాండూరు), తోషిబా ఇండస్ట్రీస్ (రుద్రారం), గ్లాండ్ ఫార్మా (పాశమైలారం), సువెన్ ఫార్మా (సూర్యాపేట), సుఖ్జిత్ స్టార్చ్ (నిజామాబాద్), మార్స్ ఇంటర్నేషనల్ (గజ్వేల్) ఉన్నాయి. ఈ కార్యకమంలో టీఎస్ పీసీబీ సహ కార్యదర్శి నీతూ ప్రసాద్, చీఫ్ ఇంజినీర్ బీ రఘు తదితరులు పాల్గొన్నారు.