రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మార్కెట్లపై పడింది. ఇప్పటికే రష్యాపై అమెరికా, యూరప్ మిత్రదేశాలు పలు రకాల ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. రష్యా ముడిచమురు ఎగుమతులపై కూడా ఆంక్షలు విధించడంతో.. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడిచమురు బ్యారెల్ ధర 139 డాలర్లకు చేరింది. 2008 జూలై తర్వాత బ్యారెల్ ధర ఇంత పెరగడం ఇదే తొలిసారి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడుతోంది.. ఈ క్రమంలోనే వరుసగా నాలుగో రోజు కూడా సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్ 1491 పాయింట్లు నష్టంలో ముగియగా.. నిఫ్టి కూడా 380 పాయింట్లు తగ్గి 15863 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ రెండూ కూడా 2 శాతంపైగా నష్టాలు చవిచూశాయి.